హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐపీఎల్ మన నగరానికి వచ్చేసింది. లీగ్ మొదలైన ఐదు రోజుల తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ సొంత ఇలాఖాలో తొలి పోరుకు సిద్ధమైంది. బుధవారం ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య పోరు జరుగనుంది. ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్లు జరిగిన ఈ సీజన్లో హోంగ్రౌండ్లో మ్యాచ్ ఆడిన ఏ జట్టూ ఓడిపోలేదు. ఉప్పల్ స్టేడియంలో స్థానిక పరిస్థితులను ఎస్ఆర్హెచ్ ఏ మేరకు వినియోగించుకుంటుందో చూడాలి. ఆస్ట్రేలియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కమిన్స్ను వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఎస్ఆర్హెచ్.. అతడిపై భారీ అంచనాలే పెట్టుకుంది. సొంత అభిమానుల మద్దతు సంపూర్ణంగా ఉన్న హైదరాబాద్.. తొలి మ్యాచ్లో కేకేఆర్ చేతిలో విజయానికి దగ్గరగా వచ్చినా ఆఖర్లో తడబడి ఓటమి వైపున నిలిచింది. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్మ్,్ర ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లు పుష్కలంగా ఉన్న ఎస్ఆర్హెచ్ను ఏ మేరకు ఆదుకుంటారో మరి.. బౌలింగ్లో కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే కీలకం. మరోవైపు తొలి మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓడిన ముంబై బుధవారం పోరులో హైదరాబాద్కు షాకివ్వాలని చూస్తున్నది.