PKL | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్ ప్లే ఆఫ్స్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. పన్నెండు వారాల హోరాహోరీ పోటీల తర్వాత లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లు సోమవారం నుంచి ప్లే ఆఫ్స్లో తలపడనున్నాయి.
గచ్చిబౌలిలో జరిగే రెండు ఎలిమినేటర్ మ్యాచ్ల్లో దబాంగ్ ఢిల్లీతో పట్నా పైరేట్స్.. గుజరాత్ జెయింట్స్తో హర్యానా స్టీలర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్లే ఆఫ్స్కు ఏర్పాట్లు పూర్తయ్యాయని లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి శనివారం వెల్లడించారు.