హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ(లింగమనేని లక్ష్మి స్మారక కప్)శుక్రవారం అట్టహాసంగా మొదలైంది. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ కేంద్రంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ టోర్నీని అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో క్రీడలకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలతో పాటు నియోజకవర్గానికి ఒక స్టేడియం నిర్మాణం చేస్తున్నాం. అన్ని వయో విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్న హైదరాబాద్ టెన్నిస్ అసోసియేషన్(హెచ్వోటీఏ)కు అభినందనలు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్వోటీఏ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఆర్గనైజింగ్ డైరెక్టక్ అనిరుధ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.