హైదరాబాద్, ఆట ప్రతినిధి: దివ్యాంగుల టీ20 టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. తుదిపోరులో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విదర్భపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ 19.1 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఒక ఓవర్ మిగిలుండగానే హైదరాబాద్ లక్ష్యాన్ని ఛేదించింది.