హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్ అట్టహాసంగా మొదలైంది. హుస్సేన్సాగర్ వేదికగా జరుగనున్న పోటీలకు మంగళవారం తెరలేచింది. ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్, భారత లేజర్క్లాస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చాంపియన్షిప్లో దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన సెయిలర్లు పోటీపడుతున్నారు. లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సిదానా మంగళవారం పోటీలను అధికారికంగా ప్రారంభించారు.
సెప్టెంబర్లో జరుగనున్న ఆసియాగేమ్స్కు సన్నాహకంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. జూలై, ఆగస్టు మధ్య కాలంలో హైదరాబాద్..సెయిలింగ్కు చాలా అనుకూలంగా ఉంటుందని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో ఇప్పటి వరకు 89 పోటీపడేందుకు రిజిస్టర్ చేసుక్నునారు. ఇందులో మన తెలంగాణ నుంచి 17 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టోర్నీలో పెద్ద వయస్కునిగా మురళీ కానురి (72 ఏండ్లు) నిలిచారు.