న్యూఢిల్లీ: యువ ఆటగాడు తిలక్ వర్మ (132 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ రాయుడు (156; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ 17 పరుగుల తేడాతో (వీజేడీ పద్ధతిలో) హిమాచల్ ప్రదేశ్పై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 360 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా హిమాచల్ లక్ష్యాన్ని 48 ఓవర్లలో 353కు కుదించగా.. ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 335 రన్స్ చేసింది. అమిత్ కుమార్ (103) పోరాడినా ఫలితం లేకపోయింది. మన బౌలర్లలో సంకేత్ 3, అనికేత్ రెండు వికెట్లు పడగొట్టారు.