బంజారాహిల్స్: హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, ఎన్ఎండీసీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక హైదరాబాద్ మారథాన్ 12వ ఎడిషన్ ఆగస్టు 26, 27 తేదీల్లో నిర్వహించనున్నారు. సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మారథాన్లో పాల్గొనే అథ్లెట్స్ ధరించే జెర్సీని ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్, ఎన్ఎండీసీ చైర్మన్ అమితవ్ ముఖర్జీ తదితరులు ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా మారథాన్ రేస్ డైరెక్టర్ ప్రశాంత్ మోర్పారియా మాట్లాడుతూ.. దేశవిదేశాలకు చెందిన సుమారు 20 వేలమంది రన్నర్లు ఈ హైదరాబాద్ మారథాన్లో పాల్గొంటారన్నారు. ఆగస్టు 26న హైటెక్స్లో 5కే రన్ నిర్వహిస్తారని, 27న ఉదయం 5గంటలకు మారథాన్ పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభిస్తారని తెలిపారు. మరోవైపు స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మాట్లాడుతూ..హైదరాబాద్ మారథాన్ ప్రతిష్ట రోజురోజుకూ పెరగడం తనకు ఆనందాన్ని ఇస్తోందన్నారు.