హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ శుభారంభం చేసింది. హైదరాబాద్ ఇన్ని్ంసగ్స్ 194 పరుగుల తేడాతో నాగాలాండ్ను చిత్తుచేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్.. కేవలం రెండు రోజుల్లోనే మ్యాచ్ను ముగించి అదుర్స్ అనిపించింది.
మొదట హైదరాబాద్ 474/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. నాగాలాండ్ కనీస ప్రతిఘటన కనబర్చలేకపోయింది. ఓవర్నైట్ స్కోరు 35/1తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన నాగాలాండ్ 153 పరుగులకు ఆలౌటైంది. తనయ్ త్యాగరాజన్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఫాలో ఆన్ ఆడిన నాగాలాండ్ రెండో ఇన్నింగ్స్లో 127 పరుగులకు కుప్పకూలింది.