ఫటోర్డా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) అదిరిపోయే బోణీ కొట్టింది. చెన్నైయిన్తో తొలి మ్యాచ్ ఓటమిని మరిపిస్తూ డిఫెండింగ్ చాంపియన్ ముంబై సిటీ ఎఫ్సీని మట్టికరిపించింది. శనివారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో హెచ్ఎఫ్సీ 3-1 తేడాతో ముంబై సిటీపై అద్భుత విజయం సాధించింది. గత ఐదు మ్యాచ్ల్లో ముంబైపై హెచ్ఎఫ్సీకి ఇది తొలి విజయం కావడం విశేషం. హెచ్ఎఫ్సీ తరఫున జావో విక్టర్ (13ని,పెనాల్టీ), ఓబ్చె (53ని), రోహిత్ దాను (82ని) గోల్స్ చేశారు. ముంబై తరఫున అహ్మద్ జాహౌ (6ని) ఏకైక గోల్ చేశాడు. ఈ సీజన్లో ఎలాగైనా కప్ కొట్టాలన్న కసితో కనిపిస్తున్న హెచ్ఎఫ్సీ అందుకు తగ్గట్లు ముంబైపై పక్కా ప్రణాళికను ఎంచుకుంది. మొదటి నుంచే దూకుడు కనబరుస్తూ దాడులు చేసింది.