హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఛేదనలో కెప్టెన్ అభిరథ్ రెడ్డి (45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 99) ధనాధన్ మెరుపులతో టీజీ 20లీగ్లో హైదరాబాద్ ఈ-చాంపియన్స్ రెండో విజయాన్ని నమోదుచేసింది. గురువారం జరగిన తమ రెండో మ్యాచ్లో ఆ జట్టు.. రంగారెడ్డి రైజర్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.
మొదట బ్యాటింగ్కు వచ్చిన రంగారెడ్డి.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 రన్స్ చేసింది. ఆదిత్య (58), అవినాష్ (53) అర్ధశతకాలతో రాణించారు. మరో మ్యాచ్లో పాలమూరు స్ట్రైకర్స్.. 5 వికెట్ల తేడాతో మెదక్ ఫాల్కన్స్ను ఓడించి టోర్నీలో బోణీ కొట్టింది. మెదక్ నిర్దేశించిన 165 పరుగుల ఛేదనను పాలమూరు 17.5 ఓవర్లలోనే దంచేసింది.