హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో తొలి విజయం నమోదు చేసుకోవడానికి హైదరాబాద్ 22 పరుగుల దూరంలో నిలిచింది. గ్రూప్-‘బి’లో భాగంగా అస్సాం తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్లో 250 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన హైదరాబాద్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (123 బ్యాటింగ్; 12 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ శతకంతో జట్టును విజయానికి చేరువ చేశాడు. తన్మయ్ మినహా తక్కినవాళ్లంతా విఫలవడంతో హైదరాబాద్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.