న్యూఢిల్లీ: తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్.. ఏప్రిల్ 30 నుంచి తాష్కెంట్లో జరిగే పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్కు అర్హత సాధించాడు. మన దేశం నుంచి ఈ మెగాటోర్నీలో 13 మంది బాక్సర్లు పాల్గొననున్నారు. హుసాముద్దీన్ 57 కేజీల విభాగంలో బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీలో వివిధ విభాగాల్లో 104 దేశాలనుంచి 640 మందికి బాక్సర్లు పోటీపడుతున్నారు. ఒలింపిక్స్ కేటగిరీలైన 51, 57, 63.5, 71, 80, 92, 92 ప్లస్ విభాగాల్లో పోటీలు జరుగనున్నాయి.