బళ్లారి: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు) ఫైనల్కు దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన సెమీఫైనల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ 4-1తో సచిన్ (హర్యానా)ను చిత్తు చేశాడు. ఫైనల్లో ఢిల్లీకి చెందిన రోహిత్ మోర్తో హుసామ్ తలపడనున్నాడు. ఇతర విభాగాల్లో శివ థాపా (64 కేజీలు), సంజీత్ (92 కేజీలు), దీపక్ (51 కేజీలు), సుమిత్ (75 కేజీలు), సచిన్ కుమార్ (80 కేజీలు), లక్ష్య (86 కేజీలు) ఫైనల్కు అర్హత సాధించారు. ఈ టోర్నీలో స్వర్ణం నెగ్గిన బాక్సర్లు.. అక్టోబర్లో సెర్బియా వేదికగా జరిగే ప్రపంచ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు.