బళ్లారి: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు) రజత పతకం సొంతం చేసుకున్నాడు. మంగళవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో నిజామాబాద్కు చెందిన హుసాముద్దీన్ 0-5తో రోహిత్ మోర్ (ఢిల్లీ) చేతిలో ఓడాడు. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన హుసామ్ వరుస విజయాలతో ఫైనల్ వరకు వచ్చినా.. తుదిమెట్టుపై తడబడటంతో రన్నరప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇతర విభాగాల్లో శివ థాపా (64 కేజీలు), సంజీత్ (92 కేజీలు), దీపక్ (51 కేజీలు), ఆకాశ్ (54 కేజీలు) సుమిత్ (75 కేజీలు) స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు.