పెర్త్: ఏఎఫ్సీ మహిళల ఫుట్బాల్ ఆసియాకప్లో భారత్ ఘోరంగా ఓటమిపాలైంది. శనివారం వార్వన్సైడ్ అన్నట్లు సాగిన పోరులో భారత్ 0-11 తేడాతో జపాన్ చేతిలో భారీ ఓటమి చవిచూసింది. మాజీ ఫిఫా చాంపియన్ అయిన జపా న్..మ్యాచ్లో భారత్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఏ దశలోనూ భారత అమ్మాయిలకు అవకాశమివ్వని జపాన్ వరుస గోల్స్తో విజృంభించారు.జపాన్ తరఫున హినాట (20ని, 35ని, 81ని), యుకి(47ని, 50ని, 65ని) హ్యాట్రిక్ గోల్స్తో చెలరేగగా, కికో సికె(45ని, 55ని), యుజుకి (4ని), యుయి (13ని), మాయా హిజికటా(62ని) గోల్స్ చేశారు.