మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్(Australia Open) బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు సెమీస్కు ఎంటర్ అయ్యారు. ప్రపంచ నెంబర్ 9వ ర్యాంక్లో ఉన్న ప్రణయ్ హెచ్ఎస్ ఈ ఏడాది మూడవ సారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఈవెంట్లో సెమీస్లోకి వెళ్లాడు. టోక్యో ఒలింపిక్ బ్రాంజ్ మెడల్ గెలిచిన ఇండోనేషియా ప్లేయర్ ఆంథోనీ గిన్టింగ్పై 16-21, 21-17, 21-14 స్కోర్తో క్వార్టర్స్లో ప్రణయ్ విజయం సాధించాడు. సెమీస్లో వరల్డ్ నెంబర్ 31 ర్యాంక్ ప్లేయర్ ప్రియాన్షు రజావత్తో ప్రణయ్ తలపడనున్నాడు.
వరల్డ్ టూర్ సూపర్ 500 ఈవెంట్లో తొలిసారి ప్రియాన్షు సెమీస్లోకి ప్రవేశించాడు. కిదాంబి శ్రీకాంత్పై 21-13, 21-8 స్కోరుతో అతను గెలుపొందాడు. ఇవాళ ఉదయం జరిగిన మహిళల క్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి పాలైంది. జాంగ్ 21-12, 21-17 స్కోరుతో సిందును ఓడించింది.