ఒసాకా: భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ జపాన్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రణయ్ 22-20, 21-19తో ప్రపంచ మాజీ చాంపియన్ లోహ్ కిన్ యే (సింగపూర్)పై విజయం సాధించాడు.
44 నిమిషాల్లో ముగిసిన పోరులో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన ప్రణయ్ వరుస గేమ్ల్లో గెలుపొందాడు. మరో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ 10-21, 16-21తో కెంటా సునెయామా (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు.