హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ మరో అంతర్జాతీయ క్రీడాటోర్నీకి వేదిక కాబోతున్నది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా మహిళల హాకీ వరల్డ్కప్ క్వాలిఫయర్స్ టోర్నీ జరుగనుంది. ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో ఆతిథ్య భారత్ సహా ఎనిమిది దేశాల జట్లు బరిలో ఉన్నాయి. ఇందులో ఆస్ట్రియా, ఇంగ్లండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ ఉన్నాయి. టోర్నీని దృష్టిలో పెట్టుకుని గతంలో ఉన్న అస్ట్రోటర్ఫ్ మైదానాన్ని కొత్తగా పునరుద్ధరించారు. టోర్నీ కోసం ఇప్పటికే భారత్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఉరుగ్వే జట్లు హైదరాబాద్కు చేరుకున్నాయి. టోర్నీ సందర్భంగా నగరానికి వచ్చే ప్లేయర్లు, ప్రతినిధుల కోసం తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని పరిచయం చేసేలా కార్యక్రమాలను రూపొందించారు. సోమవారం చీఫ్ కోచ్ జోయర్డ్ మారినె నేతృత్వంలో టీమ్ఇండియా ప్రాక్టీస్లో చెమటోడ్చింది. ఈ ఏడాది జరిగే హాకీ ప్రపంచకప్నకు ఈ టోర్నీ కీలకం కానుంది.