Hockey Test series | పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో భారత హాకీ జట్టుకు మరో ఓటమి. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇది వరకే మూడింట్లో ఓడిన భారత్.. శుక్రవారం పెర్త్ వేదికగా ముగిసిన నాలుగో మ్యాచ్లోనూ 1-3 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ 12వ నిమిషంలో గోల్ కొట్టి భారత్ను ఆధిక్యంలోకి తెచ్చాడు.
కానీ తొలి క్వార్టర్ ముగిశాక ఆస్ట్రేలియా పుంజుకుంది. భారత గోల్ పోస్ట్ను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగింది. ఆ జట్టు తరఫున హేవార్డ్ (19, 47) రెండు గోల్స్ చేయగా జాక్ వీల్స్ 54వ నిమిషంలో గోల్ కొట్టాడు.