Graham Reid | భారత హాకీ జట్టు కోచ్ గ్రాహం రీడ్ రాజీనామా చేశారు. ఇటీవల ఒడిశాలో జరిగిన హాకీ ప్రపంచకప్లో టీమ్ ఇండియా పేలవమైన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రీడ్తో పాటు కోచ్ గ్రెగ్ క్లార్క్, సైంటిఫిక్ అడ్వైజర్ మిచెల్ డేవిడ్ పెంబర్టన్ సైతం తమ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల ఒడిశా వేదికగా జరిగిన హాకీ వరల్డ్ కప్లో భారత జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. రీడ్ 2019 ఏప్రిల్లో హాకీ కోచ్గా బాధ్యతలు స్వీకరించారు. రీడ్ పర్యవేక్షణలో టీమ్ ఇండియా 2021 టోక్యో ఒలింపిక్స్లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది.
దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టుకి దక్కిన ఒలింపిక్ పతకం ఇదే కావడం విశేషం. స్వదేశంలో ఒడిశా వేదికగా జరిగిన ప్రపంచ కప్లో టీమ్ ఇండియా తొమ్మిదో స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ క్రమంలో రీడ్ తన రాజీనామాను హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీకి సమర్పించారు. నా బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని అనిపిస్తోందని, భారత హాకీ జట్టుకి హెడ్ కోచ్గా వ్యవహరించడాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ ప్రయాణంలో ప్రతీ మ్యాచ్ని ఎంతగానో ఎంజాయ్ చేశానని, భారత హాకీ టీమ్ మున్ముందు ఎన్నో గొప్ప విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నానంటూ లేఖలో రీడ్ పేర్కొన్నాడు. ఒడిశాలో జరిగిన ప్రపంచకప్లో బెల్జియంను ఓడించి.. జర్మనీ ప్రపంచ చాంపియన్గా నిలిచింది.