న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్లో భారత్ కొత్త చరిత్ర లిఖిస్తుందని మాజీ గోల్కీపర్ హెలెన్ మేరీ ధీమా వ్యక్తం చేసింది. గత మూడు, నాలుగేండ్లుగా మహిళల జట్టు నిలకడగా రాణిస్తుండడమే దీనికి కారణమని హెలెన్ చెప్పుకొచ్చింది. ఇటీవల అర్జెంటీనా పర్యటనలో రాణిరాంపాల్ సారథ్యంలోని టీమ్ఇండియా మెరుగైన ప్రదర్శన కనబరిచిందని పేర్కొంది. హాకీ ఇండియా ఏర్పాటు చేసిన ‘హాకీ పే చర్చ’ అనే కార్యక్రమంలో పాల్గొన్న హెలెన్ మాట్లాడుతూ ‘ప్రపంచ మేటి జట్లుగా కొనసాగుతున్న అర్జెంటీనా, జర్మనీపై మన మహిళల జట్టు అంచనాలకు మంచి రాణించింది. టోక్యో విశ్వక్రీడల కోసం అమ్మాయిలు 90 శాతం సిద్ధమైనట్లు కనిపిస్తున్నది’ అని అంది.