IND vs WI : నాలుగో టీ20లో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. షిమ్రాన్ హెట్మైర్(61 : 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీ బాదడంతో 8 వికెట్ల నష్టానికి 178 రన్స్ కొట్టింది. చివరి ఓవర్లో ఓడియన్ స్మిత్(9 నాటౌట్) సిక్స్ కొట్టాడు. దాంతో, కరీబియన్ జట్టు 178 పరుగులు స్కోర్ చేసింది. రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన షై హోప్(45) రాణించాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశారు.
అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతున్న కెప్టెన్ రొవమన్ పావెల్(Rovman Powell) బ్యాటింగ్ తీసుకున్నాడు. అయితే.. 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన విండీస్ను హోప్, హెట్మైర్ ఆదుకున్నారు. వీళ్లు ధనాధన్ ఆడుతూ స్కోర్ బోర్డును పరగులు పెట్టించాడు. హోప్ ఔటయ్యాక రెచ్చిపోయన హెట్మైర్ హాఫ్ సెంచరీతో జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించాడు.