RCB vs UPW : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో యూపీ వారియర్స్ (UPWarriorz) రెండో విజయం నమోదు చేసింది. బ్రబౌర్న్ స్టేడయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)పై పది వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా నాలుగో ఓటమి ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీకి 138 పరుగులకే ఆలౌట్ చేసిన యూపీ, ఆ తర్వాత బ్యాటింగ్లోనూ దుమ్మురేపింది. కెప్టెన్ అలిసా హేలీ (96) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడింది. మరో ఓపెనర్ దేవికా వైద్యా (36)తో రాణించింది.
స్వల్ప లక్ష్య ఛేదనలో యూపీ వారయర్స్ ఓపెనర్లు హేలీ, దేవిక దూకుడుగా ఆడారు. పవర్ప్లేలో యూపీ 55 రన్స్ చేసింది. ఆ తర్వాత కూడా వీళ్ల దూకుడు కొనసాగించారు. గ్యాప్స్లో బౌండరీలు కొడుతూ స్కోర్బోర్డును పరుగులు పెట్టించారు. వీళ్లు బౌండరీలతో విరుచుకుపడడంతో మరో 7 ఓవర్లు మిగిలి ఉండగానే యూపీ విజయం సాధించింది. ఆర్సీబీ కెప్టెన్ మంధాన బౌలర్లను మార్చినా కూడా ఫలితం లేకపోయింది.
యూపీ వారియర్స్ కెప్టెన్ హేలీ డబ్ల్యూపీఎల్లో తొలి ఫిఫ్టీ బాదింది. కేవలం 29 బంతుల్లోనే ఆమె ఫిఫ్టీ కొట్టింది. ఈ లీగ్లో ఆమె తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసింది. ఆమె ఇన్నింగ్స్లో 10 ఫోర్లు ఉన్నాయి. హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చిన హేలీ మరింత దూకుడుగా ఆడింది. శ్రేయాంక పాటిల్ వేసిన ఆరో ఓవర్లో హేలీ రెచ్చిపోయింది. వరుసగా హ్యాట్రిక్ ఫోర్లు కొట్టింది. అంతేకాదు రేణుకా ఠాకూర్ ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు బాదింది. ఆర్సీబీ బౌలర్లపై ఫోర్లతో విరుచుకు పడింది. 96 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చింది. ఈ టోర్నమెంట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీకి శుభారంభం లభించింది. ఓపెనర్ సోఫీ డెవినే ఫోర్లతో యూపీ వారియర్స్ బౌలర్లపై విరుచుకు పడింది. 3 ఓవర్లకే ఆ జట్టు 29 రన్స్ చేసింది.. అయితే.. నాలుగో ఓవర్లో షాక్ తగిలింది. ఫామ్లో ఉన్న కెప్టెన్ స్మృతి మంధాన (4)ను రాజేశ్వరీ గైక్వాడ్ ఔట్ చేసింది. దాంతో, 29 రన్స్ వద్ద ఆ జట్టు తొలి వికెట్ పడింది. మరో ఓపెనర్ సోఫీ డెవినే (32), ఎలిసా పెర్రీ (21)తో కలిసి ధాటిగా ఆడంది. వీళ్లు రెండో వికెట్కు 45 రన్స్ జోడించారు. సోఫీని బౌల్డ్ చేసిన ఎక్లెస్టోన్ ఈ జోడీని విడదీసింది. 116 రన్స్ వద్ద పెర్రీ ఐదో వికెట్గా వెనుదిరిగింది. కనికా ఆహుజా (8), హీథర్ నైట్ (2) తక్కువ రన్స్కే పెవిలియన్ చేరారు. దాంతో, ఆ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది.