హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్పై వేటు పడింది. మరోమారు ఎన్నికల్లో పోటీచేయాలనుకున్న అజర్ ఆశలపై సుప్రీం కోర్టు నియమిత జస్టిస్ లావు నాగేశ్వర్రావు నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ నీళ్లు గుమ్మరించింది. ఏకకాలంలో హెచ్సీఏతో పాటు దక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగా అజర్ కొనసాగడాన్ని అనర్హతగా భావిస్తూ సస్పెన్షన్ వేసింది.
దీంతో ఈ నెల 20వ తేదీన జరిగే హెచ్సీఏ ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలు లేకుండా ఓటరు జాబితా నుంచి పేరు తీసివేసింది. జూలై 31, 2023 ఆర్డర్ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్ నాగేశ్వర్రావు..అజర్కు లేఖ ద్వారా స్పష్టత ఇచ్చారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు పాల్పడిన కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.