హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్రంలోక్రికెట్ను అభివృద్ధి చేయడమే ఏకైక ఎజెండాతో హెచ్సీఏ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నామని ఆగమ్రావు పేర్కొన్నారు. ప్యానెల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ తరఫున కార్యదర్శి అభ్యర్థిగా పోటీపడుతున్న కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆగమ్రావు మిగిలిన సభ్యులతో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సుదీర్ఘ హెచ్సీఏ చరిత్రలో ఇప్పటి వరకు జిల్లాల నుంచి ఒక్క వ్యక్తికి కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు.
కరీంనగర్కు చెందిన నేను తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నాను. హైదరాబాద్కు దీటుగా జిల్లాలోనూ క్రికెట్ అభివృద్ధి చేయాలన్నదే మా ప్యానెల్ లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన ప్లేయర్లకు కొదువలేదు. వారిని వెలుగులోకి తీసుకురావాలంటే నిరంతరం క్రికెట్ టోర్నీలు నిర్వహించాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అనిల్కుమార్, దల్జీత్సింగ్, బసవరాజు, మహేంద్ర, వినోద్ పాల్గొన్నారు.