Vijay Hazare Trophy | రాజ్కోట్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని హర్యానా చేజిక్కించుకుంది. శనివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో హర్యానా 30 పరుగుల తేడాతో రాజస్థాన్ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. అంకిత్ కుమార్ (88), కెప్టెన్ అశోక్ మనేరియా (70) అర్ధశతకాలతో రాణించగా.. రాహుల్ తెవాటియా (24; 3 ఫోర్లు, ఒక సిక్సర్), సుమిత్ కుమార్ (28 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) ఆఖర్లో వేగంగా ఆడారు.
రాజస్థాన్ బౌలర్లలో అనికేత్ చౌదరి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ 48 ఓవర్లలో 257 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అభిజిత్ తోమర్ (106; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), కునాల్ సింగ్ (79; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాడారు. హర్యానా బౌలర్లలో హర్షల్, సుమిత్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.