Harmanpreet Kaur | మహిళల టీ20 వరల్డ్ కప్ (Women’s T20 World Cup)లో టీమిండియా (Team India) ఆస్ట్రేలియాపై ఐదు పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) అభిమానులకు భావోద్వేగ సందేశాన్ని ఇచ్చింది. భారత జట్టు సెమీఫైనల్లో పేలమైన ఫీల్డింగ్తో ఆస్ట్రేలియా 172 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు చివరి వరకు చేరి ఓటమిపాలైంది. మ్యాచ్లో చివరి 30 బంతుల్లో 39 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో ఐదువికెట్లున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్లో విజయం ఖాయమని అంతా ఊహించారు.
52 పరులు చేసి దూకుడుగా ఆడుతున్న కెప్టెన్ హర్మన్ప్రీత్ రనౌట్ కావడంతో ఫలితం తారుమారైంది. మ్యాచ్లో ఓటమి తర్వాత హర్మన్ప్రీత్ ట్విట్టర్ ద్వారా భావోద్వేగ సందేశాన్ని అందించింది. అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన హర్మన్ప్రీత్.. జట్టు ఓడిపోవడం చూసి బాధగా అనిపించిందని, హృదయ విదారక ఓటమి తర్వాత జట్టు బలంగా పుంజుకుంటుదని, మైదానంలో గొప్ప ప్రదర్శన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘ఈ ప్రపంచకప్లో మద్దతునిచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ కృతజ్ఞతలు. జట్టుపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. క్రికెట్ అభిమానిగా మీ జట్టు ఓడిపోవడం బాధాకరమని నాకు తెలుసు. నేను ఒక్కటే చెప్పగలను. మేం బలంగా పుంజుకొని గొప్ప ప్రదర్శన చేస్తాం’ అని ట్వీట్ చేసింది.