Harmanpreet Kaur : భారత మహిళల జట్టు సారథి హర్మన్ప్రీత్ కౌర్(Harmanpreet Kaur)కు భారీ షాక్ తగిలింది. మిస్ కూల్ కెప్టెన్గా పేరొందని ఆమెకు మ్యాచ్ ఫీజులో ఏకంగా 75 శాతం జరిమానా పడింది. బంగ్లాదేశ్(Bangladesh)తో టైగా ముగిసిన మూడో వన్డే(Third ODI)లో ఆమె అంపైర్ నిర్ణయంతో విభేదించడమే కాకుండా కోపంగా బ్యాట్ను వికెట్లకేసి కొట్టడమే అందుకు కారణం. దాంతో, మ్యాచ్ ఆఫీషియల్ భారత కెప్టెన్ తీరును లెవల్ 2 నేరంగా పరిగణించాడు. అందుకుని ఆమెకు 75 శాతం ఫైన్తో పాటు నాలుగు డీమెరిట్ పాయింట్లు(demerit points) కేటాయించాడు.
‘మైదానంలో (వికెట్లను బ్యాట్తో కొట్టడం) అలా ప్రవర్తించినందుకు హర్మన్ప్రీత్కు మ్యాచ్ ఫీజులో 50 శాతం, అలాగే సిరీస్ ప్రదాన కార్యక్రమంలో అంపైర్లను తప్పుపట్టినందుకు మరో 25 శాతం ఫైన్ విధించాం. దురుసు ప్రవర్తనకు గానూ 3, ప్రజెంటేషన్ సమయంలో అలా మాట్లాడినందుకు ఒక డీమెరిట్ పాయింట్లు కేటాయించాం’ అని మ్యాచ్ అధికారి క్రిక్బజ్(Cricbuzz)తో చెప్పాడు.
బ్యాట్తో వికెట్లను కొడుతున్న హర్మన్ప్రీత్
మూడో వన్డేలో 225 పరుగుల లక్ష్య ఛేదనలో యస్తికా భాటియా(4) ఔటయ్యాక హర్మన్ప్రీత్ క్రీజులోకి వచ్చింది. అయితే.. స్మృతి మంధాన(59)తో కలిసి జాగ్రత్తగా ఆడింది. అయితే.. 21 బంతుల్లో 14 పరుగులు చేసిన ఆమెను అంపైర్ తన్వీర్ అహ్మద్(Tanvir Ahmed) ఎల్బీగా ఔటిచ్చాడు. అయితే.. అంపైర్ నిర్ణయంతో షాక్ తిన్న భారత కెప్టెన్ కోపంతో వికెట్లను బ్యాట్తో కొట్టింది. పెవిలియన్కు వెళ్తూ అంపైర్ను దూషించింది కూడా. అంతటితో ఆ విషయాన్ని విడిచిపెట్టలేదు. సిరీస్ ప్రజెంటేషన్ సమయంలో కూడా హర్మన్ప్రీత్ అంపైర్ల తప్పిదాలపై మాట్లాడింది. మళ్లీ బంగ్లాకు వచ్చినప్పుడు అంపైర్ల తప్పిదాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పింది.
భారీ లక్ష్య ఛేదనలో.. హర్లీన్ డియోల్(77), జెమీమా రోడ్రిగ్స్(33 నాటౌట్) పోరాడడంతో భారత జట్టు గెలుపు వాకిట నిలిచింది. అయితే.. చివరి వికెట్గా మేఘనా సింగ్ (6) ఔట్ కావడంతో 225 పరుగుల వద్ద భారత జట్టు ఆలౌటయ్యింది. దాంతో, ఇరుజట్ల స్కోర్లు సమం అయ్యాయి. కానీ, వర్షం కారణంగా అంపైర్లు సూపర్ ఓవర్ ఆడించకుండానే భారత్, బంగ్లాదేశ్ను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.