మెల్బోర్న్: మహిళల బిగ్బాష్ లీగ్(డబ్ల్యూబీబీఎల్)లో భారత క్రికెటర్ల హవా కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు వేర్వేరు జట్ల తరఫున బరిలోకి దిగుతుండగా, తాజాగా టీమ్ఇండియా టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్, జెమీమా రోడ్రిగ్స్..మెల్బోర్న్ రెనిగేడ్స్కు ఆడబోతున్నారు. ఈ విషయాన్ని జట్టు యజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.