శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత మహిళలు తొలి విజయం సాధించారు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారధ్యంలోని భారత జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 172 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో హర్మన్ప్రీత్ కౌర్ (44) ఛేజ్ను ముందుండి నడిపించింది.
ఆమెతోపాటు ఆల్రౌండర్ దీప్తి శర్మ (22 నాటౌట్), పూజా వస్త్రాకర్ (21 నాటౌట్) కూడా రాణించడంతో టీమిండియా కేవలం 38 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి సిరీస్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన హర్మన్ప్రీత్కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. మూడు వికెట్లు తీసి, 22 పరుగులతో అజేయంగా నిలిచిన దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.