Asia Cup | ఇషాన్ కిషాన్ ఔటైన తర్వాత దూకుడుగా ఆడుతూ స్కోర్ పెంచిన హార్దిక్ పాండ్యా.. షాహీన్ అఫ్రిది వేసిన 44వ ఓవర్ తొలి బంతికి అఘా సల్మాన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. ఆపై రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ వెంట వెంటనే ఔట్ కావడంతో టీం ఇండియా కష్టాల్లో చిక్కుకుంది. 44 ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా ఏడు వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. నజీం షా వేసిన 45 ఓవర్ తొలి బంతికి శార్దూల్ ఠాకర్ ఆడబోయి షాదాబ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
అంతకుముందు సెంచరీ దిశగా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న ఇషాన్ కిషాన్.. పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ వేసిన 38వ ఓవర్ మూడో బంతిని భారీ షాట్ కొట్టడంతో బాబర్ ఆజామ్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో టీం ఇండియా ఐదో వికెట్ కోల్పోయింది.