న్యూఢిల్లీ: హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకున్నా టీ20 ప్రపంచకప్లో భారత్పై ఎలాంటి ప్రభావం ఉండదని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ కోహ్లీకి ఇతర అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్తో సోమవారం జరిగిన వామప్ మ్యాచ్లో హార్దిక్ బౌలింగ్ వేయకపోవడంపై కపిల్ స్పందిస్తూ.. ‘కోహ్లీ ఐదుగురు ఫుల్టైమ్ బౌలర్లతో 188 పరుగులకు ఇంగ్లండ్ను నియంత్రించాడు. జట్టుకు ఎప్పుడూ ఆల్రౌండర్ భారీ తేడాను తీసుకొస్తాడు. హార్దిక్ బౌలింగ్ వేయకపోయినా భారత్పై ఎలాంటి ప్రభావం ఉండదు. కోహ్లీకి మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇద్దరు ఆల్రౌండర్లు ఉన్నారు. బౌలర్లను మారుస్తుంటే కెప్టెన్ పనితనం ఏమిటో తెలుస్తుంది. జట్టులో ప్రతిభ కలిగిన వారికి రెండు ఓవర్లు ఇవ్వొచ్చు. ఇక బౌలింగ్ లోటును భర్తీ చేయడానికి భారత్కు ఫైర్ పవర్ ఉంది’ అని అన్నాడు. ఇంగ్లండ్ సిరీస్ నుంచి తాజా ఐపీఎల్తో పాటు వామప్ మ్యాచ్లో హార్దిక్ బౌలింగ్ వేయకపోవడాన్ని కపిల్ ప్రస్తావించాడు.