Hardik Pandya | న్యూఢిల్లీ: భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు వచ్చే నెల ఐర్లాండ్తో జరుగనున్న టీ20 సిరీస్కు విశ్రాంతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీమ్ఇండియా.. వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతుండగా.. దీని తర్వాత కరీబియన్లతో మూడు వన్డేలు, 5 టీ20లు ఆడనుంది.
పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రధాన ఆటగాడైన పాండ్యాపై పనిభారం పడకుండా.. బోర్డు అతడికి విశ్రాంతినిచ్చే యోచనలో ఉందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.కీలక టోర్నీల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.