చాలా రోజులుగా బౌలింగ్ చేయకుండా భారత జట్టులో కూడా స్థానం కోల్పోయిన యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఈ ఐపీఎల్లో సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులకు ఆందోళన కలిగించిన బౌలింగ్ విషయంలో చాలా మెరుగయ్యాడు. గుజరాత్ టైటన్స్ కెప్టెన్గా ఉన్న అతను.. తొలి మ్యాచ్ నుంచే తన పూర్తి కోటా ఓవర్లు వేస్తూ వస్తున్నాడు.
అంతేకాక తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో రెండో ఓవర్లోనే బంతి అందుకొని ఆశ్చర్యపరిచాడు. అయితే 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తూ తొలి బంతికే వికెట్ కూడా తీశాడు. దీంతో చాలా మంది మాజీ ఆటగాళ్లు ఇది భారత క్రికెట్కు శుభపరిణామమని అంటున్నారు. వసీం జాఫర్ కూడా ఇదే విషయం చెప్పాడు.
‘‘నేను చాలా ఇంప్రెస్ అయ్యా. తను 140 కిలోమీటర్ల వేగం అందుకున్నాడు. అదే సమయంలో షమీతో కలిసి కొత్త బంతితో బౌలింగ్ చేశాడు. నా అభిప్రాయం ప్రకారం హార్దిక్ బాగా బౌలింగ్ చేశాడు. ఇది కచ్చితంగా మంచి పరిణామం’’ అని వివరించాడు. ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన హార్దిక్ 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అతనితోపాటు లోకీ ఫెర్గూసన్ నాలుగు వికెట్లతో రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్పై గుజరాత్ విజయం సాధించింది.