Harbhajan Singh : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను ఓడించడానికి భారత జట్టు ప్రణాళికలు రచిస్తోంది. అయితే.. రోహిత్ శర్మ జోడీగా ఓపెనర్గా ఎవరిని ఆడించాలనే సందిగ్దం ఉంది. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ మధ్య పోటీ నెలకొంది. దాంతో, ఈ సమస్యకు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పరిష్కారం సూచించాడు. రోహిత్ శర్మతో కలిసి శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని హర్భజన్ అన్నాడు. ‘శుభ్మన్ గిల్ ఫామ్లో ఉన్నాడు. టెస్టుల్లో కేఎల్ రాహుల్ కంటే అతడి గణాంకాలు గొప్పగా ఉన్నాయి. ప్రస్తుతం కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్లో ఉన్న గిల్ ఈమధ్యే వన్డేల్లో, టీ20ల్లో పలు రికార్డులు సృష్టించాడు. అందుకని మొదటి టెస్టులోనే కాకుండా నాలుగు టెస్టుల్లోనూ అతడిని ఓపెనర్గా పంపాలి’ అని ఈ మాజీ స్పిన్నర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
13 టెస్టుల్లో 736 రన్స్
ఓపెనింగ్ భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యం. సిరీస్ ఏదైనా ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంపై జట్టు విజయం ఆధారపడుతుంది. అందుకని భారత్, ఆస్ట్రేలియాను ఓడించాలంటే రోహిత్ జోడీగా శుభ్మన్ను పంపాలి అని హర్భజన్ వెల్లడించాడు. గిల్ 2020లో ఆసీస్పై టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకు 13 టెస్టులు ఆడిన అతను 736 రన్స్ చేశాడు. ఈమధ్యే గిల్ మూడు ఫార్మాట్లలో శతకాలు బాదిన భారత క్రికెటర్గా గుర్తింపు సాధించాడు. నాగ్పూర్ వేదికగా ఫిబ్రవరి 9న భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు ఆడనున్నాయనే విషయం తెలిసిందే.