న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ మేరకు పలువురు మహిళా రెజ్లర్లు శుక్రవారం దేశ రాజధానిలోని కన్నాట్ప్లేస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేగాక ఢిల్లీ మహిళా కమిషన్లో కూడా ఫిర్యాదు చేశారు.
దీనితో కమిషన్ హెడ్ స్వాతి మలివాల్ బ్రిజ్భూషణ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు రాసిన లేఖలో సిఫారసు చేశారు. బ్రిజ్భూషణ్ ఆరోపణలపై నియమించిన కమిటీ నివేదిక బహిర్గతం చేయాలంటూ ఆదివారం పలువురు సీనియర్ రెజ్లర్లు మళ్లీ ఆందోళన చేపట్టారు. దిగ్గజ మహిళా బాక్సర్ మేరీ కోమ్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ నియమిత కమిటీ నివేదిక సమర్పించినా దానిలోని అంశాలను బహిర్గతం చేయకపోవడంపై నిరసన వ్యక్తంచేస్తూ రెజ్లర్లు ఆందోళన చేపట్టారు.