హైదరాబాద్, ఆట ప్రతినిధి: హర్యానా వేదికగా వచ్చే నెల 4 నుంచి 13 వరకు జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు పోటీపడుతున్నారు. వెయిట్లిఫ్టింగ్ విభాగంలో స్పోర్ట్స్ స్కూల్కు చెందిన గణేశ్(81కి), గంగోత్రి(55కి), మౌనిక(64కి)ను ఎంపిక చేసినట్లు రాష్ట్ర వెయిట్లిఫ్టింగ్ అసోసియేషన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న వీరు ఖేలోఇండియా గేమ్స్లోనూ సత్తాచాటాలని చూస్తున్నారు. ఈ ముగ్గురు లిఫ్టర్లతో కూడిన జట్టుకు మాణిక్యాలరావు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. టోర్నీ కోసం వచ్చే నెల 1న హర్యానాకు వీరు బయల్దేరి వెళ్లనున్నారు.