హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు చదువుల్లోనే కాదు ఆటల్లోనూ అదరగొడుతున్నారు. మైసూర్ వేదికగా జరిగిన సౌత్జోన్ గోల్ఫ్ చాంపియన్షిప్లో గురుకుల గోల్ఫర్లు మూడు పతకాలతో సత్తాచాటారు.
అద్భుత ప్రదర్శన కనబరిచిన అమూల్య (క్యాటగిరీ-ఏ)-స్వర్ణం, అఖిల (క్యాటగిరీ-ఏ)-రజతం, అనూష (క్యాటగిరీ-బీ)-కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పతక విజేతలను గురుకుల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.