Gulveer Singh | టెహ్రాన్: ఆసియా ఇండోర్ అథ్లెటిక్ చాంపియన్షిప్లో గుల్వీర్ సింగ్ పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. సోమవారం జరిగిన 3000 మీటర్ల ఫైనల్ రేసులో గుల్వీర్ 8 నిమిషాల 7.48 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. నూర్ సుల్తాన్ (8:8.85 సె.; కిర్గిస్థాన్), జలీల్ నసారీ (8:9.39సె.; ఇరాన్) వరుసగా రజత కాంస్యాలు దక్కించుకున్నారు.
ఈ చాంపియన్షిప్లో భారత్కు ఇది నాలుగో స్వర్ణం కాగా.. అంతకుముందు తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజి (100 మీటర్ల హర్డిల్స్), తజిందర్పాల్ సింగ్ తూర్ (షాట్పుట్), హర్మిలాన్ (1500 మీటర్ల రేసు) బంగారు పతకాలు గెలుచుకున్నారు. మరోవైపు మహిళల 3000 మీటర్ల రేసులో భారత అథ్లెట్ అంకిత రజతం గెలుచుకుంది.