ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో గుజరాత్ టైటన్స్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్కి చేరుకుంది.
193 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (54 – 24 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్సర్లు) తప్ప మరెవరూ గుజరాత్ బౌలర్ల ధాటికి ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. షిమ్రోన్ హెట్మయర్(29), రియాన్ పరాగ్(18), జేమ్స్ నీషమ్(17), సంజూ శాంసన్(11) పరుగులు చేసి వెనుతిరిగారు.
ఓపెనర్గా వచ్చిన దేవదత్ పడిక్కల్(0) డకౌటయ్యాడు. ఆ వెంటనే వచ్చిన అశ్విన్(8), రస్సీ వాండర్(6), చాహల్(5) క్రీజులో నిలబడడానికి తడబడ్డారు. చివర్లో కుల్దీప్ సేన్(0), ప్రసిద్ధ్ కృష్ణ(4) నాటౌట్గా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్ చెరో మూడు వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్య ఒకటి, మహమ్మద్ షమి ఒక వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు భారీ స్కోరు చేసింది. గుజరాత్ కెప్టెన్ హార్దీక్ పాండ్యా హాఫ్ సెంచరీతో చెలరేగడంతో స్కోరు బోర్డు వేగంగా పెరిగింది. అయితే గుజరాత్ ఓపెనర్లు ఆరంభంలోనే తడబడ్డారు. మాథ్యూ వేడ్ (7), విజయ్ శంకర్ (2) ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పట్టారు. ఇక శుభ్మన్ గిల్ (13) కూడా చేతులేత్తేశాడు. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు నిలకడగా ఆడుతూ భారీ స్కోరు దిశగా మ్యాచ్ను కొనసాగించారు. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (87) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అభినవ్ మనోహర్ (43) సాధించగా.. పాండ్యా, మనోహార్ జట్టుకు భారీ స్కోర్ జోడించారు. ఇంతలోనే అభినవ్ ఔట్ కావడంతో బరిలోకి దిగిన డేవిడ్ మిల్లర్(31) దూకుడు పెంచి జట్టు స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 20 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ నాలుగు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో యుజవేంద్ర చాహల్, రియాన్ పరాగ్, కుల్దీప్ సేన్ తలా ఒక వికెట్ తీశారు.