కట్టుదిట్టమైన బౌలింగ్కు బాధ్యతాయుతమైన బాదుడు తోడవడంతో ఐపీఎల్లో గుజరాత్ హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. బౌలింగ్లో షమీ, లిటిల్, నూర్ రాణిస్తే.. బ్యాటింగ్లో గిల్, విజయ్ శంకర్ దంచికొట్టి గుజరాత్ను టేబుల్ టాపర్గా నిలిపారు!
కోల్కతా: డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుస విజయాల జోరు కొనసాగిస్తున్నది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో కోల్కతాను చిత్తుచేసింది. దీంతో 8 మ్యాచ్ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అధిష్టించింది.మొదట కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ (39 బంతుల్లో 81; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు హాఫ్సెంచరీతో ఆకట్టుకోగా.. ఆఖర్లో రస్సెల్ (34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. టైటాన్స్ బౌలర్లలో షమీ మూడు, జోస్ లిటిల్, నూర్ అహ్మద్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన పాండ్యా సేన 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (24 బంతుల్లో 51 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించగా.. గిల్ (49; 8 ఫోర్లు), డేవిడ్ మిల్లర్ (32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), పాండ్యా (26) అండగా నిలిచారు. జోస్ లిటిల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
కోల్కతా: 179/7 (గుర్బాజ్ 81, రస్సెల్ 34; షమీ 3/33, లిటిల్ 2/25), గుజరాత్: 17.5 ఓవర్లలో 180/3 (విజయ్ 51 నాటౌట్, గిల్ 49; నరైన్ 1/24).