ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 11 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత హర్లీన్ డియోల్(45 బంతుల్లో 67, 9ఫోర్లు, సిక్స్), సోఫియా డంక్లే(28 బంతుల్లో 65, 11ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీలతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 201/7 స్కోరు చేసింది. శ్రేయాంక పాటిల్, హీథర్నైట్ రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 190/6 స్కోరు చేసింది. సోఫీ డివైన్(45 బంతుల్లో 66, 8ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీతో రాణించింది. గార్డ్నర్(3/31), సదర్ల్యాండ్(2/56) ఆకట్టుకున్నారు. డంక్లేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్కు మెరుగైన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ సబ్బినేని మేఘన(8) నిరాశపరిచింది. సోఫియా డంక్లే, హర్లీన్ డియోల్..ఆర్సీబీ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ దూకుడైన ఆటతీరు కనబరిచారు. ముఖ్యంగా డంక్లే ఆకాశమే హద్దుగా చెలరేగింది. బౌండరీలతో వీరవిహారం చేస్తూ 18 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకుంది.లక్ష్యఛేదనలో బెంగళూరు కూడా ఆఖరి వరకు విజయం కోసం పోరాడినా లాభం లేకపోయింది.
గుజరాత్: 20 ఓవర్లలో 201/7(డియోల్ 67, డంక్లే 65, నైట్ 2/17, పాటిల్ 2/32), బెంగళూరు: 20 ఓవర్లలో 190/6(డివైన్ 66, పెర్రీ 32, గార్డ్నర్ 3/31, సదర్ల్యాండ్ 2/56)