గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలకడగా రాణిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (0)ను సంగ్వాన్ డకౌట్ చేశాడు. దీంతో మరోసారి బెంగళూరు బ్యాటింగ్ కుప్పకూలుతుందని అంతా భావించారు.
అయితే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (53 నాటౌట్), రజత్ పటీదార్ (47 నాటౌట్)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఇద్దరూ నిలకడగా రాణిస్తూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరూ అడపాదడపా బౌండరీలు బాదుతూ ఉండటంతో 13 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు జట్టు ఒక వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది.
5⃣0⃣ for @imVkohli! 👏👏
43rd #TATAIPL fifty for the #RCB opener! 👍
Follow the match ▶️ https://t.co/FVnv8ovvEQ #GTvRCB pic.twitter.com/OnYAutfN8H
— IndianPremierLeague (@IPL) April 30, 2022