పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలి వికెట్ తీశాడు. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ను రెండో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేర్చాడు. హార్దిక్ వేసిన షార్ట్ బంతిని బాదడానికి ప్రయత్నించిన మయాంక్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో గాల్లోకి లేచిన బంతిని సర్కిల్లో ఫీల్డింగ్ చేస్తున్న రషీద్ ఖాన్ చాలా సులభంగా అందుకున్నాడు.
మయాంక్ మరోసారి నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. ఇప్పటి వరకు పంజాబ్ ఆడిన ఏ మ్యాచ్లోనూ మయాంక్ సరైన ఇన్నింగ్స్ ఆడలేదు. ఇతర ఆటగాళ్ల ప్రదర్శనల వల్లే పంజాబ్ రెండు విజయాలు నమోదు చేసింది. కెప్టెన్ అయిన తర్వాత మయాంక్ ఆటతీరు దారుణంగా పడిపోవడం పంజాబ్ జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది.