పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీనిలో టాస్ గెలిచిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. తమ జట్టులో ఆల్రౌండర్ విజయ్ శంకర్ వెన్నునొప్పితో ఆడటం లేదని, వరుణ్ ఆరోన్ కూడా గాయంతో దూరమయ్యాడని తెలిపాడు.
వీరి స్థానాల్లో సాయి సుదర్శన్, దర్షన్ నల్కండే ఆడుతున్నట్లు చెప్పాడు. అలాగే పంజాబ్ జట్టుకలో కూడా ఒక మార్పు చేసినట్లు మయాంక్ అగర్వాల్ వెల్లడించాడు. లంక కీపర్ బ్యాటర్ రాజపక్స స్థానంలో ఇంగ్లండ్ స్టార్ జానీ బెయిర్స్టోను తీసుకున్నట్లు చెప్పాడు.
గుజరాత్ టైటన్స్: శుభ్మన్ గిల్, మాథ్యూ వేడ్, సాయి సుదర్శన్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, దర్షన్ నల్కండే, లోకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్స్టో, లియామ్ లివింగ్స్టన్, షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ, ఒడియన్ స్మిత్, అర్షదీప్ సింగ్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా.