గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ (43) అవుటయ్యాడు. దీంతో అతను హాఫ్ సెంచరీ చేస్తాడని ఆశించిన అభిమానులంతా నిరాశ చెందారు. రషీద్ ఖాన్ వేసిన ఎనిమిదో ఓవర్లో మూడో బంతిని రివర్స్ స్వీప్ ఆడేందుకు రోహిత్ ప్రయత్నించాడు.
అయితే బంతి బ్యాటును మిస్ అయ్యి.. ప్యాడ్లను తాకింది. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో రషీద్ ఖాన్.. రివ్యూ తీసుకోవాలని హార్దిక్ను కోరాడు. రివ్యూలో రోహిత్ అవుటని తేలడంతో గుజరాత్ శిబిరం సంబరాల్లో మునిగిపోయింది. రోహిత్ అభిమానులు నిరాశ చెందారు.