గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జట్టు..మాథ్యూ వేడ్ (1), శుభ్మన్ గిల్ (84), హార్దిక్ పాండ్య (31), డేవిడ్ మిల్లర్ (20), రాహుల్ తెవాటియా (14), విజయ్ శంకర్ (13) అభినవ్ మనోహర్ (1), రషీద్ ఖాన్ (0 నాటౌట్) పరుగులు చేయడంతో 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో ఢిల్లీని గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండో ఓవర్లోనే దెబ్బకొట్టాడు. తొలి బంతికే సేఫెర్ట్ (3)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత గుజరాత్ బౌలర్లంతా రాణించడంతో పృథ్వీ షా (10), మన్దీప్ సింగ్ (18) పరుగులు చేసి అవుటయ్యారు. రిషభ్ పంత్ (43), లలిత్ యాదవ్ (25), రోవ్మెన్ పావెల్ (20) కాసేపు పోరాడినప్పటికీ.. అక్షర పటేల్ (8), శార్దూల్ ఠాకూర్ (2) నిరాశ పరిచారు. కుల్దీప్ యాదవ్ (14 నాటౌట్), ఖలీల్ అహ్మద్ (0), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3 నాటౌట్) ఏమీ చేయలేకపోయారు.
దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ 4, మహమ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇది గుజరాత్ జట్టుకు ఈ ఐపీఎల్లో వరుసగా రెండో విజయం కావడం గమనార్హం.