శంషాబాద్ రూరల్: ప్రతిష్ఠాత్మక మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులు గొంగడి త్రిష, యశశ్రీ, షాలినికి సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ ఆత్మీయ స్వాగతం పలికారు. దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన మెగాటోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడిస్తూ అరంగేట్ర ప్రపంచకప్ను యువ భారత్ సగర్వంగా ముద్దాడింది.
టీమ్ఇండియా కప్ గెలువడంలో మన తెలంగాణ బిడ్డలు త్రిష, యశశ్రీ, ఫిట్నెస్ ట్రైనర్ షాలిని కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ‘ప్రపంచం గర్వపడేలా తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేసిన ప్లేయర్లను తగిన రీతిలో సత్కరిస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం లో సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేస్తున్నా రు’ అని అన్నారు. మరోవైపు సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ప్లేయర్లను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది’ అని అన్నారు.