MS Dhoni | రెండు, మూడు నెలల్లో ప్రారంభం కాబోయే ఐపీఎల్ 2023లో ఎంఎస్ ధోనీ ఆడతాడో, లేదోననే ఆందోళనలో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఎంఎస్ ధోనీ తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. చాలా రోజుల తర్వాత ధోనీ బ్యాట్ పట్టి నెట్లో ప్రాక్టీస్ చేశాడు. రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ధోనీ తన ఆటకు పదును పెట్టాడు. ధోనీ ప్రాక్టీస్కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రెండింగ్లోనూ ఉంది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించిన మిస్టర్ కూల్.. ఎట్టకేలకు ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ఇక ఐపీఎల్ 2022లో విఫలమైన సీఎస్కే.. ఈ సారి ఎలాగైనా ఛాంపియన్గా నిలవాలని పట్టుదలతో ఉంది. దాని కోసం ఇప్పటికే మినీ వేలంలో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ను రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసింది. సీఎస్కే జట్టులో ధోనీ, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, అంబటి రాయుడు, రుతురాజ్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.
Thala Dhoni is getting ready for IPL 2023. pic.twitter.com/2sMk2IWVil
— Johns. (@CricCrazyJohns) January 25, 2023