హైదరాబాద్, ఏప్రిల్ 29: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) నూతన ప్రెసిడెంట్గా ప్రశాంత్ నాదెళ్ల నియమితులయ్యారు. ఈ నియామకం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు వచ్చే ఏడాది కూడా వర్తించనున్నది. 32వ హైసియా వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశమై నూతన కార్యావర్గాన్ని ఎన్నుకున్నారు.
ప్రస్తుతం ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న మనీషా సాబూ స్థానాన్ని ప్రశాంత్ నాదెళ్ల భర్తీ చేయనున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రశాంత్..వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. వైస్ ప్రెసిడెంట్గా బిపిన్ పెండ్యా ల, జాయింట్ సెక్రటరీగా వినయ్ అగ్రావాలా నియమితులయ్యారు.